శ్రీశైలం : శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు దాతలు తమ వంతు విరాళాలు ఇచ్చినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన సూర్యప్రకాశ్ క్షమాపాండే దంపతులు రూ. 10 లక్షల చెక్కును విరాళంగా అందజేసినట్లు చెప్పారు. అదే విధంగా మహారాష్ట్ర లాథూర్కు చెందిన శివరాజ్ చంద్రకాంత్ మిట్కారి కుటుంబసభ్యులతో కలిసి అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళంగా ఆలయ పర్యవేక్షకురాలు సాయికుమారిని కలిసి చెక్కు రూపంలో అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు. దేవస్థానం నిర్వహిస్తున్న పలు సేవా పథకాలకు విరాళాలు ఇస్తున్న దాతలను ఈవో కేఎస్ రామారావు అభినందించారు.