అమరావతి : తిరుమలలో వీఐపీ దర్శనం టికెట్ల కోసం మరోసారి భక్తులు ఆందోళనకు దిగారు. సిఫారసు లేఖలపై దర్శనం కల్పించలేదని ఏఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వెంటనే దర్శనం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తిరుమల కొండపై శుక్రవారం రాత్రి తెలంగాణ భక్తులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శ్రీవారి దర్శనానికి తాము తీసుకొచ్చిన ప్రముఖుల సిఫార్సు లేఖలను ఉదయం తీసుకుని.. అర్ధరాత్రి అయినా టికెట్లు ఇవ్వకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం పలువురు భక్తుల నుంచి సిఫార్సు లేఖలను జేఈఓ కార్యాలయం సిబ్బంది తీసుకున్నారు. రాత్రి 10 గంటలైనా దర్శనం కేటాయింపు సమాచారం ఇవ్వకపోవడంతో భక్తులంతా టికెట్లు విక్రయించే ఎంబీసీ 34కు చేరుకొని ఆందోళనకు దిగారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో భక్తులు వారితో వాగ్వాదానికి దిగిన విషయం విదితమే.