మేడ్చల్ మల్కాజిగిరి : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన జిల్లాలోని కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..బీహార్ రాష్ర్టానికి చెందిన ఇర్ఫాన్ (20) గత మూడు సంవత్సరాల క్రితం బతుకుదేరువు నిమిత్తం కీసరకు వలస వచ్చాడు.
కీసరలోని ఓ టైర్ల పంచర్ దుకాణంలో రోజువారి కూలీగా పనిచేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆయనకు అప్పుల బాధ ఎక్కువకైంది. దీంతో జీవితం మీద విరక్తి చెందిన ఇర్ఫాన్ కీసరగుట్ట రోడ్డులో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ బిల్డింగ్ షెటర్లో గత ఆదివారం రాత్రి ఫ్యాన్కు ఉరేసుకొని మృతిచెందాడు.
ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు