కృష్ణాజిల్లా : కరోనా సోకిందన్న భయంతో బావిలో దూకి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. కొణిజర్ల గ్రామానికి చెందిన ఇలవరపు భాస్కర్ రావు (33)కు ఇటీవల కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
దీంతో కోలుకుంటానో.! లేదోనన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం గ్రామశివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి మృతదేహాన్ని బయటకు తీశారు. భాస్కర్ రావు ఆత్మహత్యతో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.