అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,863 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 8,239 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 11,135 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1796122కు చేరింది. ప్రస్తుతం 96100 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1688198కు చేరింది. కరోనా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 11824కు పెరిగింది.