అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాల్లో కర్ఫ్యూ వేళలను సడలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. జూలై 8వ తేదీ నుంచి ఈ సడలించిన వేళలు అమల్లోకి వస్తాయని తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు తాజా సడలింపులు వర్తిస్తాయని సీఎం కార్యాలయం తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. ఆ రెండు జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు వర్తిస్తాయని వెల్లడించింది.
అయితే, అన్ని రకాల దుకాణాలను రాత్రి 9 గంటల లోపే మూసివేయాలని ఆదేశించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పటిలాగే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ వేళల్లో సడలింపు ఉంటుంది. అన్ని రకాల దుకాణాలను సాయంత్రం 6 గంటల వరకే మూసివేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో సినిమా ధియేటర్లను సగం కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు అనుమతి ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది.
అయితే, సీటు సీటుకు మధ్య ఒక సీటు ఖాళీ ఉండేలా చూసుకోవాలని, అన్ని రకాల కొవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. రెస్టారెంట్లు, జిమ్లు, కళ్యాణ మండపాలు, అన్ని జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.