శంషాబాద్, జూలై 6 : ఇంటింటికీ తిరుగుతూ మహిళకు బొట్టు పెట్టి.. చేతికి చెట్టు ఇచ్చే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి. మంగళవారం పట్టణంలో నిర్వహించిన 6వ రోజు పట్టణప్రగతి కార్యక్రమంలో ఆమెతో పాటు కమిషనర్ సాబేరలి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కౌన్సిలర్లు అనుసరించారు. వింతవైనానికి స్థానిక మహిళలు సానుకూలంగా స్పందించారు. ఊరువాడ ఏకమై ఉత్సాహంగా పట్టణ ప్రగతిలో స్వచ్ఛందంగా తరలి వచ్చారు. మేము సైతం అంటూ మొక్కలు నాటి నీరు పోశారు. మానవాళి మనుగడ, జీవకోటికి జీవనాధారం పచ్చదనంతో ముడిపడి ఉందని శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్రెడ్డి తెలిపారు.
శంషాబాద్లో పట్టణప్రగతి సమీక్ష, చైతన్య సదస్సులో ఆమె మాట్లాడుతూ పట్టణప్రగతి, హరితహారంలో శంషాబాద్ మున్సిపల్ను ఆదర్శంగా నిలుపాలని సూచించారు. అందుకు సమిష్టి కృషి చేయాల్సి ఉంటుందన్నారు. పక్కగా పారిశుధ్య నిర్వహణ జరుగాలని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ వహించాలని నగరదీపికలకు, సిబ్బందికి వివరించారు. కౌన్సిలర్లు, అధికారులు పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ పరిధిలో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
బండ్లగూడ, జూలై 6 : కాలనీల్లో పార్కులు ఉండటం వల్ల వృద్ధులు, చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. కపిలానగర్లో రూ. 20లక్షలతో ఏర్పాటు చేసిన పార్కులను మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పద్మవతి పాపయ్యయాదవ్, శ్రీనాథ్రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానికులతో కలిసి పార్కులో ఆట వస్తువులను, ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాంతాలను అభివృద్ధి పరుచుకుకోవడంతో పాటు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పట్టణప్రగతిని ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లోని ఆయా కాలనీల్లో పార్కుల అభివృద్ధికి అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, డీఈ శారదా, ఏఈ రాజిరెడ్డి, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, పీఎస్సీఏ చైర్మన్ రాందాస్, నాగరాజు, చేవేళ్ల యాదిరెడ్డి, పాపయ్యయాదవ్, పాండు, సంగీతం దశరత్ పాల్గొన్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆరో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీల్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, జూలై 6 : మారుమూల గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి అన్నారు. మంగళవారం రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి లో భాగంగా మండలంలోని సుల్తాన్పల్లి గ్రా మ పంచాయతీ పరిధిలోని కేబిదొడ్డి గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది రోజుల ప్రణాళికలో భాగంగా పంచాయతీలు పరిశుభ్రంగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఆరుమొక్కలు నాటితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవెరుతుందన్నారు. కార్యక్రమలంలో ఆర్ఐ సునీత, ఉప సర్పంచ్ స్పందన, వార్డు సభ్యులు అరుంధ, చంద్రశేఖర్, సత్యమ్మ, వీరచారి, శ్రీశైలం, మాల కృష్ణ, నాయకులు గోపాల్, మళ్లికార్జున్, వీరేశం, పాండురంగారెడ్డి, బల్వంత్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.