అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజుకూ విలయం సృష్టిస్తున్నది. పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 22,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,128 మంది కోలుకున్నారు.
వైరస్ బారినపడిన వారిలో చికిత్స పొందుతూ 85 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,03,337కు పెరిగింది.
ఇవాళ్టి వరకు 8,374 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 1,70,588కి చేరాయి. ఏపీలో కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.