అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. అక్కడ ఇప్పటికీ 1,500లకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కూడా అక్కడ 1,843 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,45,697కు చేరింది.
ఇక కరోనా మరణాలు కూడా ఏపీలో క్రమం తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రకాశం జిల్లాకు చెందినవారు ముగ్గురు కాగా.. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఇద్దరు చొప్పున ఉన్నారు. కృష్ణ జిల్లాలో ఒక వ్యక్తి కరోనాకు బలయ్యాడు. ఇవాళ నమోదైన 12 మరణాలతో కలిపి ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,209కి పెరిగింది.
ఇక గడిచిన 24 గంటల్లో 2,199 మంది కరోనా బారి నుంచి కోలుకోగా ఇప్పటివరకు నమోదైన మొత్తం రికవరీల సంఖ్య 19,08,917కు చేరింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 23,571 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇవాళ మొత్తం 70,727 శాంపిల్స్ను పరీక్షించగా 1,843 మందికి పాజిటివ్గా తేలింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు మొత్తం 2,39,09,363 శాంపిల్స్ను పరీక్షించారు.