వరంగల్ రూరల్ : సీఎం కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు గుళ్లు, మసీదులు, చర్చీల్లో పూజలు చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని సంగెం మండల కేంద్రానికి చెందిన పేరాల సురేష్ సంగమేశ్వర ఆలయంలో 108 కొబ్బరి కాయలు కొట్టి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకున్నాడు.
అలాగే సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి చర్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పలువురు టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు!