న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని బసాయి దారాపూర్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఓ ట్రక్కు డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రక్కు క్లీనర్, ప్రత్యక్ష సాక్షి అయిన జితేందర్ నుంచి వివరాలు సేకరించారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ట్రక్కు ముందు ఆపారని, అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి ట్రక్ డ్రైవర్ నడుం భాగంలో తుపాకీతో కాల్చారని పోలీసులు తెలిపారు. అనంతరం మొబైల్ ఫోన్, రూ.5వేల నగదును తీసుకొని పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు. మృతుడిని హర్యానాలోని పాల్వాల్లోని గోరేకా మొహల్లా వాసి లఖ్మి చంద్ (50)గా గుర్తించారు. బాధితుడిని వెంటనే గురు గోవింద్ సింగ్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.