అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కుప్పంలో కరోనా రోగి ప్లాట్ఫామ్పైనే మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
కుప్పం ఘటన రాష్ట్రంలో కరోనా పరిస్థితికి అద్దం పడుతుందని అన్నారు. సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం కక్షసాధింపు రాజకీయాలు మానుకొని ప్రజారోగ్య సంరక్షణపై దృష్టిపెట్టాలని అన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.