అమరావతి : కరోనా వైరస్ నియంత్రణకు అమలు చేస్తున్న కర్ఫ్యూను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులు తగ్గాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ అమల్లో ఉండాలని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ర్టంలో కర్ఫ్యూ పెట్టి 10 రోజులే అయిందన్నారు. కరోనా కేసులను తగ్గించేందుకు మరోసారి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. పరిస్థితి అదుపులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని సీఎ జగన్ స్పష్టం చేశారు.