అమరావతి : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 125 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసు సంఖ్య 8,92,269కి చేరింది. 8,83,505 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1579 యాక్టివ్ కేసులుండగా.. 7185 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 23,417 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1, 45,80,783 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.