శాన్ఫ్రాన్సిస్కో, జూలై 9: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులందరికీ భారీ బోనస్ ప్రకటించింది. కొవిడ్ సంక్షోభం నెలకొన్న ఆర్థిక సంవత్సరంలో సవాళ్లను ఎదుర్కొన్నందుకు గుర్తింపుగా ఒక్కొక్కరికీ 1,500 డాలర్ల (దాదాపు రూ.1.12 లక్షలు) చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ ఇంటర్నల్ మెమోలో తెలిపింది. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ దిగువ స్థాయి ఉద్యోగులందరూ బోనస్కు అర్హులు. అమెరికాలో, ఇతర దేశాల్లోనూ పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరికీ ఈ బహుమతి ఇస్తున్నట్లు కంపెనీ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ కాథలీన్ హోగాన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్కు 1,75,508 మంది ఉద్యోగులున్నారు. 21 దేశాల్లో కంపెనీకి వర్క్సైట్లున్నాయి. ఉద్యోగులకు బోనస్గా మొత్తం 20 కోట్ల డాలర్లను ఇస్తున్నది. ఇది రెండు రోజుల కంపెనీ లాభాలతో సమానం.