పెద్దపల్లి : కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడటంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి వద్ద చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఒక్కసారిగా బర్రె అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడ్డ మహిళలను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు.