బెంగళూర్ : కర్నాటకలో డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగుచూడటంతో ఈ వేరియంట్ వ్యాప్తిని నిలువరించేందుకు కఠిన కట్టడి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. పెద్దసంఖ్యలో పరీక్షలు చేపట్టడంతో పాటు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి తాజా వేరియంట్ వ్యాప్తికి అడ్డకట్ట వేసే చర్యలు తక్షణమే చేపట్టాలని కర్నాటకను కేంద్రం కోరింది.
ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడకుండా చూడాలని, డెల్టా ప్లస్ వేరియంట్ ప్రబలిన ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల వ్యాక్సినేషన్ను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించింది. తాజా వేరియంట్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ రవికుమార్కు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కోరారు.