హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 70,961 నమూనాలను పరీక్షించగా, 6,876 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,029, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 502, నల్లగొండలో 402, వరంగల్ అర్బన్లో 354, సూర్యాపేటలో 372 కేసులు వెలుగుచూశాయి. కరోనాకుతోడు ఇతర వ్యాధుల కారణంగా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో రికవరీ రేటు 82.30 శాతానికి చేరగా, 7,432 మంది దవాఖానలు, ఐసొలేషన్ సెంటర్లలో కోలుకొని డిశ్చార్జి అయ్యారు.