అమరావతి : ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థకశాఖ, డెయిరీ, మత్స్యశాఖల మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూల్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఇటీవల ఓ టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అప్పలరాజు కర్నూల్లో కరోనా కొత్తరకం మ్యుటెంట్ ఎన్-440కే వైరస్ విస్తరిస్తోందని అన్నారని పోతురాజు రవికుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మంత్రి వ్యాఖ్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన మంత్రిపై వెంట చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా ఇప్పటివరకు మంత్రిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పూర్తి విచారణ అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఆయనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.