హైదరాబాద్ : సంగారెడ్డి ఐడీఏ బొల్లారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను ఓ వ్యక్తి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్లో ఎలక్ట్రీషియన్ నర్సింహ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారు జామున నర్సింహ తన భార్య స్వరూప, అత్త ఎల్లమ్మపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలై ఇద్దరు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని సీఐ ప్రశాంత్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, భార్యపై అనుమానంతోనే హత్య చేసి ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు.