తిరుమల: భారత అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటనలో ఉన్నారు. దసరా సందర్భంగా తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద జస్టిస్ రమణకు ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలో సీజేఐ జస్టిస్ రమణ పాల్గొంటారు.
తిరుచానూరులో పద్మావతి అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ రమణకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.