అమరావతి : అమరావతి భూముల కేసులో చట్టబద్ధంగానే చంద్రబాబుపై సీఐడీ దర్యాప్తు జరుగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్కు కక్ష సాధింపు ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అసైడ్డ్ భూముల విషయంలో ఫిర్యాదు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం సీఐడీ ముందు వివరణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ కక్షసాధింపు చర్యలు దిగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. సీఐడీ ప్రాథమిక విచారణలో చంద్రబాబు తప్పు చేశారని తేలిందన్నారు. తప్పుచేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని సజ్జల అన్నారు.