ఆంధ్రప్రదేశ్ లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలలో మార్పులు చేసింది అక్కడి సర్కారు. కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో మే 5 తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తున్నది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 7:30 నుంచి 11:30 గంటలు మధ్య సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తాయి. కర్ఫ్యూ అమలు దృష్ట్యా పని వేళ్లలో మార్పులు చేయాల్సి వచ్చిందని ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు ప్రకటనలో తెలిపారు.