హైదరాబాద్: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్య వేళల్లో మార్పులు చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కర్ఫ్యూ సమయాన్ని కుదించింది. ఉభయ గోదావరి, చిత్తూరు, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆ నాలుగు జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠిన కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ సడలింపులు ఈనెల 7 వరకు అమల్లో ఉండనున్నాయి.