బాలానగర్, జూలై 9: పల్లెప్రగతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని గ్రామస్తులు అధికారులకు సహకరించి ప్రగతికి కృషిచేయాలని మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ పేర్కొన్నారు. నాలుగో విడుత పల్లెప్రగతిలో భాగంగా గురువారం రాత్రి మండలంలోని పెద్దరేవల్లిలో పల్లెనిద్ర కార్యక్రమానికి హాజరై గ్రామంలో సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం వీధుల్లో పర్యటించారు. ప్రతి ఇంటి వద్ద ఆరు మొక్కలు నాటాలని శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం శ్మశానవాటిక, పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో శ్రీదేవి, సర్పంచ్ నర్మద, పంచాయతీ కార్యదర్శి శశికాంత్, అంగన్వాడీ టీచర్లు సునీత, కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని వాయిల్కుంటతండా సర్పంచ్ గోపినాయక్ అన్నారు. శుక్రవారం తండావాసులకు మొక్కలను పంపిణీ చేసి మాట్లాడారు. అదేవిధంగా మండల కేంద్రంలో పోలీస్స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్లు, సీఐ జములప్ప మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఆయా కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శి బాసునాయక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
రాజాపూర్ జూలై 9: గ్రామాల్లో హరితహారంలో భాగంగా నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని ఎంపీపీ సుశీల అ న్నారు. శుక్రవారం కుచ్చర్కల్లో పల్లెప్రగతి కార్యక్రమం లో భాగంగా పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామంలోని రోడ్ల వెంట మహిళలతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, ఏపీవో భారతి, సర్పంచ్ సుధారాణి, పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించుకోవాలి
హన్వాడ, జూలై 9: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పల్లెప్రగతి కార్యక్రమంలో పరిష్కరించుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ సర్ణసుధాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొనగట్టుపల్లిలో గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఇంటి వద్ద మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయనిర్మల, సర్పంచ్ మానస, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
మిడ్జిల్, జూలై 9 : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేం ద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీటీసీ శివప్రసాద్, బాలస్వామి, రాములు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కరానికే ‘పట్టణ ప్రగతి’
మహబూబ్నగర్టౌన్, జూలై 9: వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కరానికి రాష్ట్ర ప్రభుత్వ పట్టణప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పేర్కొన్నారు. శుక్రవారం 42వ వార్డులో నిర్వహించిన పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. పట్టణాభివృద్ధికి మంత్రి శ్రీనివాస్గౌడ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో రాజేశ్వరి, కౌన్సిలర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై ఆరా
భూత్పూర్, జూలై 9: పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో సమస్యలు పరిష్కరించనున్నట్లు ఎంపీడీవో మున్ని తెలిపారు. శుక్రవారం మండలంలోని వెల్కిచర్ల, భట్టుపల్లి, చౌలతండాలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించినట్లు తెలిపారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సాయిబాబా, తాసిల్దార్ చెన్నకిష్టన్న, ఎంపీవో విజయకుమార్, సర్పంచులు పద్మాజక్కిరెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి గోపీ, ఏపీఎం, ఏపీవో తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పలు సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపాలిటీలో కొత్తగా నిర్మించిన మహబూబ్నగర్-భూత్పూర్ రోడ్డు డివైడర్పై మొక్కలు నాటి, పేయింటింగ్ వేస్తున్నారు. ఈ పనులను చైర్మన్ పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ నూరుల్నజీబ్, నాయకులు అశోక్గౌడ్, సత్యనారాయణ ఉ్గన్నారు.
పల్లెల్లో పచ్చదనం పెంచాలి
మూసాపేట(అడ్డాకుల), జూలై 9: హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి పల్లెల్లో పచ్చదనం పెంచాలని జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి సూచించారు. అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి పల్లెప్రకృతి వనం అందంగా నిర్మించారని సర్పంచ్ మల్లికానాగరాజును జెడ్పీటీసీ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గ్రామంలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి రూ. 5లక్షల ప్రొసిడింగ్ను అందజేశారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు మల్లికనాగరాజు, జయన్నగౌడ్, శ్రీకాంత్, ఎంపీటీసీ శామలమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకుందాం
జడ్చర్లటౌన్, జూలై 9: ప్రతిఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హౌసింగ్బోర్డు, విజయనగర్కాలనీ, పాతబజార్, మదీనాకాలనీ, గౌరీశంకర్కాలనీల్లో మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లతో కలిసి మొక్కలు పంపిణీ చేశారు. ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన వారిని సత్కరించారు. హౌ సింగ్బోర్డుకాలనీలో పారిశుధ్య పనులను పరిశీలించారు.