ఢిల్లీ, జూన్ 14:ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం మేరకు కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్కు నిధుల మంజూరును 3,182.88 కోట్లకు పెంచింది. ఇది 2020-21 లో రూ .790.48 కోట్లుగా ఉండగా. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ఈ కేటాయింపును నాలుగు రెట్లకు పెంచడంతో పాటు 2024 నాటికి ప్రతి గ్రామీణ ప్రాంతానికి నల్లా నీరు సరఫరా చేయడానికి రాష్ట్రానికి పూర్తి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.