శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు తీపిరెడ్డి మహేష్రెడ్డి శిరీషారెడ్డి దంపతులు, నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి డీఎఫ్వో కృష్ణగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం క్షేత్రానికి చేరుకున్న వీరు స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, వృద్ధమల్లికార్జున స్వామికి బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చక వేదపండితులు వేదాశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు.