Andhrapradesh-news
- Dec 18, 2020 , 21:11:02
VIDEOS
టీడీపీ మాజీ ఎంపీ కార్యాలయాలపై సీబీఐ దాడులు

హైదరాబాద్ : బ్యాంక్లను మోసగించిన కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) శుక్రవారం టీడీపీ మాజీ ఎంపీ కార్యాలయాలపై రైడ్ చేసింది. మాజీ ఎంపీ స్వస్థలమైన గుంటూరు జిల్లాలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలోని కార్యాలయాల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ కార్యాలయాల్లోని తమ సహచరుల సహకారంతో న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ రైడ్ చేపట్టింది. మాజీ ఎంపీకి చెందిన కంపెనీ రూ. 3,822 కోట్ల మోసానికి పాల్పడ్డట్లుగా సీబీఐ కేసు బుక్ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లించిందని ఆరోపణ. ఈ వ్యవహారంలో ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ఇంతకుక్రితం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది.
తాజావార్తలు
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
- వాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే,
MOST READ
TRENDING