అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నది. 59 రోజులుగా అధికారులు కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులందరినీ ఒక్కొక్కరిగా ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఇవాళ కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ఈ కేసులో అనుమానితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ను అధికారులు ప్రశ్నించారు. అతడిని సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందుల కోర్టుకు తరలించారు. మేజిస్ట్రేట్ ఎదుట సునీల్ యాదవ్ను హాజరుపరిచి వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ పలువురిని విచారించి కీలక ఆధారాలు సేకరించింది.