అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వేస్తున్నారు. నిన్న సాయంత్రం వివేకా ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మళ్లీ బుధవారం ఉదయం కూడా అధికారులు ఇంటిని పరిశీలిస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకా 2019, మార్చి 15న హత్యకు గురయ్యారు. గుర్తుతెలియన వ్యక్తులు ఆయన నివాసంలోనే కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి హతమార్చారు. అయితే ఈ హత్య అనేక అనుమానాలకు తావీయడంతో.. సీబీఐ విచారణ చేపట్టింది. దీంతో గతకొంతకాలంగా విచారణను వేగంవంతం చేసింది. ఇప్పటికే అనుమానితులను విచారించిన విషయం తెలిసిందే.