హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులిచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు నోటీసులిచ్చింది.
జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని.. సాక్షుల ప్రభావితం చేస్తున్నారని ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటీషన్పై మే 7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ ధాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు ఇటీవల విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్పై 11 చార్జ్షీట్లను సీబీఐ నమోదు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి