దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నది. పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ విధిస్తూ మరింత విస్తృతి జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. మరో వారం రోజుల తర్వాత నుంచి 18 ఏండ్ల పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ను జయించొచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు.
మల్టీవిటమిన్లు, ఒమేగా-3, ప్రోబయోటిక్స్ లేదా విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షించుకోవచ్చు. బీఎంజే న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ జర్నల్లో ప్రచురించిన ఒక పరిశోధనలో వెల్లుల్లి, విటమిన్ సీ, జింక్ మందులు తీసుకోవడం వల్ల వైరస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తేలింది. బ్రిటన్లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు.
యూకేలో కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ సమయంలో 2020 మే, జూన్, జూలై నెలల్లో 3,72,720 మంది డైటరీ సప్లిమెంటరీలను పరిశోధకులు విశ్లేషించారు. వీరిలో మే-జూలై మధ్య, 1,75, 652 మంది క్రమం తప్పకుండా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోగా, 1,97, 068 మంది ఎలాంటి డైటరీ సప్లిమెంట్లు తీసుకోలేదు. వీరిలో మూడింటా రెండంతల మంది మహిళలు ఉండగా.. సగం మంది శరీరం బరువు పెరగడం గమనించారు. అయితే వీరిలో మే-జూలై మధ్య 23,521 మందికి పాజిటివ్గా తేలగా.. 3,49,199 మంది నెగెటివ్గా తేలారు.
ప్రోబయోటిక్స్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, మల్టీవిటమిన్లు లేదా విటమిన్ డీ తీసుకోవడం సార్స్ కోవ్-2 ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని వరుసగా 14 శాతం, 12 శాతం, 13 శాతం, 9 శాతం కలిగి ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు. విటమిన్ సీ, జింక్ లేదా వెల్లుల్లి సప్లిమెంట్లను తీసుకునే వారిలో అలాంటి ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. శరీరంలోని వ్యాధి నిరోధక ప్రక్రియ చురుగ్గా ఉండాలంటే విటమిన్ డీతోపాటు మైక్రోన్యూట్రియంట్స్ విధిగా తీసుకోవాల్సిన అవసరాన్ని పరిశోధకులు నొక్కి చెప్పారు. ఇవి ఇతర ఇన్ఫెక్షన్లు దండెత్తకుండా ఉండేందుకు కూడా దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..