గుంటూరు: గుంటూరు శివారు గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద పెదకాకాని పోలీసులు నిర్వహించిన సోదాల్లో సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నిందితుల వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం.. మత్తు మందు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముగ్గురు నిందితులు బీటెక్ చదువుతున్నారు. వీరి నుంచి 25 ట్రమడాల్ మాత్రలు, 25 గ్రాముల ఎల్ఎస్డీ వ్రాపర్స్, 7 గ్రాముల ఎండీఎంఏ మత్తు మందులతో పాటు రూ.24,500 నగదును స్వాధీనం చేస్తుకున్నారు. ఆన్లైన్ ద్వారా సింథటిక్ మత్తు మందు తెప్పించుకొని విక్రయాలు జరుపుతున్నారని ఎస్పీ వివరించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.