హైదరాబాద్ : కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తున్న కంటి చుక్కల మందును ఆయుర్వేద నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ మేరకు పరిశీలన నివేదికను గురువారం ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. మందు తయారీ, నిల్వ విధానాల్లో పలు ప్రమాణాలు పాటించాలని సూచించింది. ‘‘కళ్లల్లో వేసే మందుకు రంగు ఉండకూడదు. కానీ కంటి చుక్కల మందు కొంత రంగుగా ఉంది.
మందు నిల్వ, తయారీ విధానాల్లో మార్పులు చేయాలి. నిల్వ కూడా గాజుపాత్రలు లేదా మందులు చేసే దానిలో ఉంచాలి. క్లోజ్డ్ ఏరియాల్లో ల్యాబ్ తరహా వాతావరణంలో మందు తయారు చేయాలి. నిర్దేశిత ప్రమాణాల్లో తయారు చేశాక మాత్రమే స్టెరైల్ టెస్టు చేయగలం. 8 రకాల పరీక్షలు చేసి మందుతో ఎలాంటి ఇబ్బంది లేదని గుర్తించాం. కే మందు హానికరం కాదు.. వినియోగించవచ్చు’’ అని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.