హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటా టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సాయి దేదీప్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో దేదీప్య 6-2, 6-4 తేడాతో అవిశ్క గుప్తా(జార్ఖండ్)పై అలవోక విజయం సాధించింది.