అమరావతి, జూలై : కృత్రిమ కోడిగుడ్ల వ్యవహారం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో ఉన్న ఆండ్రావారిపల్లె లో ఒక మహిళ కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి వాటిని ఉడకబెట్టగా… ఎంతసేపటికీ కోడిగుడ్లు ఉడకకపోవడంతో, అనుమానం వచ్చిన మహిళ ఇరుగు పొరుగు వారికి ఆ గుడ్డు చూపించింది.
ఆ గుడ్డును పరిశీలించిన వారు అది కృత్రిమ కోడి గుడ్డుగా తేల్చారు. రబ్బర్ లాగా సాగుతూ కోడి గుడ్డులా ఉన్నప్పటికీ గుడ్డు పైన ఉన్న పెంకులో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండడంతో స్థానికంగా కృత్రిమ కోడిగుడ్ల వ్యవహారంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గుడ్ల వ్యవహారం వ్యాపారుల్లో సైతం కలకలం రేపుతుంది. నెల్లూరు జిల్లాలో గతంలోనూ ఇదే తరహాలో కృత్రిమ కోడిగుడ్లు బయటపడ్డాయి. ఇప్పుడు మరోమారు కృత్రిమ కోడిగుడ్లు వెలుగులోకి రావడంతో జిల్లాలో కోడిగుడ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.