రాజాపేట, ఏప్రిల్ 2: రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాజాపేట, పాముకుంట గ్రామాల్లో రైతు వేదికలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్ధతులను చర్చించుకోవటానికి రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. రైతును రాజు చేయాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. త్వరలోనే కాళేశ్వరం జలాలతో ఆలేరు నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాస్రెడ్డి, సీసీ బ్యాంక్ చైర్మన్ భాస్కర్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గౌటే లక్ష్మణ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఏడీఏ పద్మావతి, సర్పంచ్లు చిందం లక్ష్మీపోచయ్య, మధుసూదన్రెడ్డి, ఈశ్వరమ్మాశ్రీశైలం, ధర్మేందర్సింగ్, కరుణాకర్రెడ్డి, భాగ్యమ్మ, ఎంపీటీసీ ఎడ్ల నరేశ్రెడ్డి, నాయకులు భాస్కర్గౌడ్, వెంకటేశ్గౌడ్, సంతోశ్గౌడ్, సిద్ధులు, రాంరెడ్డి, కరీం సోమలింగగుప్తా, కనకయ్య పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజాపేటకు చెందిన స్వామికి రూ. 30 వేలు, సాయినాథ్ రూ. 16 వేలు, కల్యాణికి రూ. 60వేలు, కిరణ్కు రూ.55 వేలు, పాముకుంట రహీంకు రూ. 57 వే లు, దూదివెంకటాపురం విష్ణుకు రూ. 21 వేల చెక్కులు అందజేశారు. నరేందర్, రాం రెడ్డి, నాగరాజు,ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో దుర్గమ్మ పండుగ
మండలంలోని మల్లెగూడెంలో శుక్రవారం దుర్గమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మొ క్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామస్తులు వనభోజనాలకు తరలివెళ్లారు. ప్రభు త్వ విప్ గొంగిడి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సర్పంచ్ రాజు, సీసీ బ్యాంక్ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ నేత రాజు, వెంకటేశ్వర్రెడ్డి, శివకుమార్, నరేశ్, కనకయ్య, సంపత్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
నేపాల్ ఆర్మీకి లక్ష డోసుల భారత్ కొవిడ్ వ్యాక్సిన్
ఒబామా నాయినమ్మ, సంఘసేవకురాలు మమా సారా కన్నుమూత
పాకిస్థాన్లో హోలీ సంబురాలు.. వీడియో
పెరిగిన వాయు కాలుష్యం.. విద్యా సంస్థల మూసివేత
పాక్లో హిందూ ఆలయంపై దాడి.. మెయిన్ డోరు ధ్వంసం
సక్సెస్.. సుయెజ్ కాలువలో ఆ షిప్ అడ్డు తొలగింది