తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన.. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు జస్టిస్ రమణకు ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ రమణ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, వేంకటేశ్వరుని చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..