ఈ మధ్యే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది కన్నడ సోయగం ప్రణీత. చిరకాల మిత్రుడు నితిన్రాజుతో కలిసి ఏడడుగులు వేసింది.దక్షిణాదిలో పాపులర్ నాయికగా చెలామణీ అవుతున్న ఈ సొగసరి లాక్డౌన్ సమయంలో నిరాడంబరంగా పెళ్లి తంతును ముగించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయమై ప్రణీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకకు ప్లాన్ చేశామని..అయితే జూలై నెలలో ఆషాఢమాసం వస్తుండటంతో లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ సింపుల్గా పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కన్నడ, తెలుగు, హిందీ పరిశ్రమలో ఉన్న నా సన్నిహితులందరిని ఆహ్వానించి వైభవంగా వివాహాన్ని జరుపుకొందామని నిర్ణయించుకున్నాం. అయితే ఆషాఢమాసం సమీపిస్తుండటంతో పాటు ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అనే అపనమ్మకంతో కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అదీగాక కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి హృదయం ద్రవించింది. సమాజం మొత్తం సంక్షోభంలో ఉన్నప్పుడు అనవసర విలాసాల జోలికి వెళ్లొద్దనే భావన కూడా సింపుల్గా పెళ్లి చేసుకోవడానికి కారణమైంది’ అని చెప్పింది ప్రణీత. ఈ వయ్యారి ప్రస్తుతం హిందీలో భుజ్, హంగామా-2 చిత్రాల్లో
నటిస్తోంది.