చెన్నై: కరోనా టీకాపై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రొత్సహించేందుకు తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఆర్టిస్ట్ గౌతమ్ ఒక ఆటోను వినూత్నంగా రూపొందించారు. ఆటో ముందు, వెనుక టీకాలను పోలిన సిరంజ్లతో డిజైన్ చేశారు. ఆటో పైన టీకా ఇంజెక్షన్ సీసా నమూనాను ఉంచారు. కరోనా టీకా తీసుకునేందుకు చాలా మంది ప్రజలు భయపడుతున్నారని గౌతమ్ తెలిపారు. అందుకే టీకా ఉపయోగంపై అవగాహన కల్పించేందుకు ఆటోను ఇలా డిజైన్ చేసినట్లు చెప్పారు. ప్రజలు చాలా ఆసక్తిగా ఆటోను చూస్తున్నారని, టీకా వేయించుకోవడం ముఖ్యమన్న తన ప్రచారం మంచి ఫలితాలను ఇస్తున్నదని ఆయన వెల్లడించారు.