అమరావతి : తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.
‘‘కరోనా సెకండ్ చాలావేగంగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. కరోనాతో మూడు రోజుల్లో నలుగురు ఉద్యోగులు మరణించారు.
దీంతో భయాందోళన మధ్య విధులు నిర్వర్తిస్తూ చాలా ఒత్తిడికి లోనవుతున్నాం. ఈ పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం ఇస్తే కొంత ఊరట లభిస్తుంది.
కనీసం వారంపాటు అందరికీ ఈ అవకాశం కల్పించాలి. ఆ తర్వాత 50 శాతం ఉద్యోగులకు రోటేషన్ పద్ధతిలో విధులు కేటాయించాలి’’ అని సీఎస్కు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.
సచివాలయానికి సందర్శకులను పూర్తిగా నిలిపి వేయాలని కోరారు. గతంలో మాదిరిగా సచివాలయాన్ని ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని విన్నవించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి