ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్
మొదటి రోజు 1530 మందికి వ్యాక్సిన్
నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్, జూన్ 24:పాఠశాలలు పున:ప్రారంభమ వుతున్న నేపథ్యంలో సర్కారు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు, సిబ్బందికి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రక్రియ ప్రారంభించగా, వైద్య సిబ్బంది మొదటి రోజు 1530 మందికి వ్యాక్సిన్ ఇచ్చింది. నాలుగైదు రోజుల పాటు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు, సిబ్బందికి గురువారం టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంచిర్యాల జిల్లాలో 2650 మంది ప్రైవేట్, 4100 ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మొదటి రోజు 358 మంది టీకాలు వేసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక నిర్మల్ జిల్లాలో 7480 మంది ఉండగా, మొదటి రోజు 105 మంది టీకా తీసుకున్నట్లు డీఈవో ప్రణీత తెలిపారు. ఆసిఫాబాద్ జి ల్లాలో 5011 మంది ఉపాధ్యాయులుండగా, 266 మంది టీకా వేయించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 8000 మంది ఉపాధ్యాయులు ఉండగా, గురువారం 801 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. గతంలో 4500 మంది టీకా తీసుకున్నారు.
నిర్ణయం బాగుంది
పాఠశాలలు పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధ్యాయులు, సిబ్బందికి టీకా వేసే వేయడం బాగుంది. ప్రభుత్వ ఆదేశాలతో మొదటి రోజే టీకా వేయించుకున్నాను. ఉపాధ్యాయులకు టీకా వేయించే కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయం.
ధైర్యాన్నిచ్చింది
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం మాకు ధైర్యాన్ని నింపింది. ఈ ధైర్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలకు నిశ్చింతగా వెళ్లి విద్యాబోధన చేయవచ్చు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు విద్యనందించేందుకు సిద్ధంగా ఉన్నాం.