అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ పరీక్షించగా మరో 4,169 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,376 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1857352కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53880 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12416కు చేరింది.