న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఈ నెల 25 వరకు అతడిని జుడీషియల్ కస్టడీలో ఉంచాలని శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గత నెల 4న ఛత్రాసాల్ స్టేడియంలో జరిగిన ఘటనలో సుశీల్ ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించగా.. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రీతిక జైన్ కస్టడీ పొడిగిస్తున్నట్లు తెలిపారు.