అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై కేసు నమోదైంది.
టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై ఆపాదిస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.
దీంతో ఎమ్మెల్యే గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించారని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నారా లోకేశ్పై డి.హిరేహాల్ పోలీసులు 111/2021 సెక్షన్లతోపాటు ఐపీపీ 153(ఏ), 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. త్వరలో లోకేశ్కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.