నేరాల నియంత్రణ, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి
కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
బాధ్యతల స్వీకరణ
హన్మకొండ సిటీ, ఏప్రిల్ 7 : శాంతి భద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి తెలిపారు. బుధవారం కమిషనరేట్లో బాధ్యతల స్వీకరించి మాట్లాడారు. గతంలో జిల్లాలో పని చేసిన అనుభవం ఉందని, కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. మావోయిస్టు కదలికలపై నిత్యం నిఘా పెడుతానని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా కృషి చేస్తానన్నారు. బాధ్యతల స్వీకరణకు ముందుగా సాయుధ పోలీసుల గౌరవ వందనంను స్వీకరించారు. కాగా, సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ జోన్ల డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు సీపీని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీపీ ఐజీ ప్రమోద్కుమార్ను కలిశారు. 2004 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన తరుణ్జోషి అదిలాబాద్, గోదావరిఖని ప్రొబేషనరీ ఏఎస్పీగా, ఆదిలాబాద్ ఓఎస్డీగా పనిచేశారు. 2008 సంవ్సరంలో వరంగల్ ఓఎస్డీగా పనిచేసిన ఆయ 2009లో పదోన్నతిపై వైజాగ్ ఎస్పీగా బదిలీపై వెళ్లారు. గ్రేహౌండ్స్, హైదరాబాద్ సెంట్రల్ జోన్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎస్పీగా, గత సంవత్సరం నుంచి పదోన్నతిపై హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సీపీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు బదిలీపై వరంగల్ కమిషనరేట్కు వచ్చారు.
ఇవి కూడా చదవండి..
సరిహద్దులో చొరబాటుదారు హతం.. భారీగా మందుగుండు స్వాధీనం
చిదంబరం, కార్తీకి ఊరట.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు