బ్రస్సెల్స్: బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్-యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందాలను యూరోపియన్ చట్టసభ సభ్యులు ఆమోదించారు. బ్రెగ్జిట్ ను విడిచిపెట్టాలని బ్రిటన్ నిర్ణయం తీసుకున్న ఐదేండ్ల తర్వాత చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందానికి ఈయూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే యూకే పార్లమెంటులో దీనికి ఆమోదం లభించింది. ఇప్పటి వరకు యూరోపియన్ పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూశారు. యూరోపియన్ పార్లమెంటులోని ఎంపీలు యూకే ప్రభుత్వం, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందానికి అనుకూలంగా మంగళవారం ఓటు వేశారు. యూనియన్లో బ్రిటన్ చేరినట్లు ఫలితాన్ని బుధవారం ఉదయం ప్రకటించారు.
గత ఏడాది డిసెంబర్ 30 న యూరోపియన్ నాయకులు యూకే-యురోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య, సహకార ఒప్పందంగా బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందంపై యూరోపియన్ కమిషన్ చైర్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ సంతకం చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా లండన్లో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. నాలుగు నెలల ఎదురుచూపుల అనంతరం ఈ ఆమోదానికి ఈయూ ఎంపీలు ఆమోదం తెలుపడంతో బ్రిటన్ హర్షం వ్యక్తం చేసింది.
సుప్రీం జస్టిస్ బ్లాక్ మెయిల్కు పాక్ ప్రభుత్వం విఫల యత్నం: బిలావాల్ భుట్టో
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్..
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..