మల్యాల, ఏప్రిల్ 11: కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఆదివారం 26వ రోజుకు చేరింది. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ పఠనాన్ని నిర్విరామంగా కొనసాగించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సతీమణి దీవెన, కొడిమ్యాల ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీలు రామ్మోహన్రావు, పునుగోటి ప్రశాంతి, చొప్పదండి మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ, బోయినపల్లి మాజీ ఎంపీపీ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. ఉత్సవమూర్తులకు స్థానాచార్యుడు జితేంద్రప్రసాద్, ప్రధా న అర్చకుడు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, అర్చకుడు శ్రీకాంత్ వేదమంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం, హారతి నిర్వహించారు. నాయకులు కోటేశ్వర్రావు, రాజేందర్, ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్శర్మ, ధర్మకర్తలు ప్రవీణ్, సురేందర్, నర్సయ్య, జాగృతి నాయకులు రాజేందర్రావు, శ్రీనివాస్గౌడ్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఎన్నికల హింసను మమతే రెచ్చగొట్టారు: అమిత్ షా
నిశాంత్ను ఆదుకుంటాం : మంత్రి కేటీఆర్