హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ కమలాకర్ బుధవారం రాత్రి యశోద దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయనకు కొద్ది రోజుల కిత్రం కరోనా పాజిటివ్గా రావడంతో క్వారంటైన్ అనంతరం నెగిటివ్ నిర్ధ్దారణ అయింది. మంగళవారం రాత్రి హర్ట్ అటాక్ రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10.30 గంటలకు మరణించారు. హిప్నో కమలాకర్ జర్నలిస్ట్, న్యాయవాదిగా పనిచేయడంతో పాటు రెండు దశాబ్దాలుగా స్టేజీ హిప్నాటిస్ట్గా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలో మూడ నమ్మకాలకు వ్యతిరేకంగా చాలా కాలం పనిచేశారు. కమలాకర్ సతీమణి డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్.
ని, భాషాపండితుల అప్గ్రెడేషన్ను పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు.