అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర వాహనదారులకు గుబులు పుట్టిస్తున్నది. రెండు జిల్లాల్లో మినహా మిగిలిన 11 జిల్లాల్లో లీటర్ ధర ఇప్పటికే సెంచరీ మార్కును దాటేసింది. శుక్రవారం విశాఖ, కడప జిల్లాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా ధరను తగ్గించింది. విశాఖలో లీటర్పై రూ. 19 పైసలు, కడపలో రూ. 17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర్ ధర వందకు దిగువకు చేరింది.
అనంతపురం జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 100.80 పైసలు, చిత్తూర్లో రూ.101, తూర్పుగోదావరిలో రూ.100.23, పశ్చిమగోదావరిలో రూ.101.23, కృష్ణా జిల్లాలో రూ. 100.70, గుంటూరులో రూ.100.89, కర్నూల్లో రూ.101.03, నెల్లూరులో రూ.100.30, విజయవాడలో రూ.100.89, ప్రకాశం జిల్లాలో రూ.100.67, శ్రీకాకుళంలో రూ.100.68, విజయనగరంలో రూ.100.04, విశాఖలో లీటర్ పెట్రోల్ రూ. 99.90, కడపలో లీటర్ ధర రూ. 99.93గా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.